English | Telugu

తులసి అందరినీ హిప్నోటైజ్ చేసి తనవైపు లాక్కుంటోంది అన్న లాస్య

తులసి వాళ్ళ ఫామిలీ హ్యాపీగా ఉన్న టైంలో అభి ఇంటికి వచ్చి తల్లిని పట్టుకుని నానా మాటలు అంటాడు. అసలు తానూ తన తల్లే కాదని ఫైర్ అవుతాడు. అభి వాళ్ళ నానమ్మ తాతయ్య అభిని తిడతారు. ఐనా ఊరుకోకుండా తన జీవితాన్ని నాశనం చేసింది తల్లే అంటూ ఇంకా ఎప్పుడు ఆ ఇంటి గుమ్మం తొక్కను అంటాడు. తల్లితో యుద్ధం ఇక్కడినుంచే స్టార్ట్ అయ్యిందని ఛాలెంజ్ చేస్తాడు. అభి మాటలకూ అందరూ షాక్ అవుతారు. అక్కడినుంచి నాన్న నందు దగ్గరకు వెళ్లి కోపంతో తులసిని తిడుతూ ఉంటాడు. లాస్య కూడా నాలుగు మాటలు కలిపి నూరి అభితో తిట్టిస్తుంది.

తాను బిజినెస్ పెట్టుకోవడానికి డబ్బులు లేవు కాబట్టి నీకు ఆస్తి వస్తే నేను తీసేసుకుంటానేమో అని భయపడి తులసి ఆస్తి నీ పేరు మీద రాయనివ్వకుండా అడ్డుపడిందేమో అని నందు అభితో అంటాడు. ఏదైమైనా నేను అంకిత దగ్గరకు వెళ్లి ఆస్తి తీసుకొస్తాను మీరు బిజినెస్ పెట్టండి డాడ్ అంటూ వెళ్ళిపోతాడు. మరో వైపు ప్రేమ్ అవకాశాల కోసం ముప్పీలహరి దగ్గర పని చేసాను అని చెప్పిన ఎవరూ నమ్మరు. ఇక శృతి పనమ్మాయిగా చేస్తున్న విషయం తులసి , అంకిత కంట బడుతుంది. తర్వాత ఏం జరిగింది. ? తెలియాలంటే స్టార్ మాలో సాయంత్రం వచ్చే గృహలక్ష్మి సీరియల్ లో చూడొచ్చు.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.